కమనీయం నరసింహుని కళ్యాణం

కలువాయి రాజుపాళెంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు

కమనీయం నరసింహుని కళ్యాణం…

  • కలువాయి రాజుపాళెంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు


కలువాయి మండలం రాజుపాళెం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


నరసింహుని జయంతిని పురస్కరించుకొని.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాళెం గ్రామంలో వెలసియున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఈదూరి రామాచార్యులు కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు.. కళ్యాణ మహోత్సవంలో రాజుపాళెం గ్రామానికి చెందిన నందిమండలం ప్రణీత్ వర్మ – శాలిని దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించి… స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు..భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తరించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవలో ఊరేగించారు.. భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *