150 ఎకరాలకు పారుదల కాలువకు పూడికలను తీయించిన వీపీఆర్
మా కుటుంబాలు ఉన్నంత కాలం వీపీఆర్కు రుణపడి ఉంటాం
విడవలూరు మండల కేంద్రంలోని రైతులకు మహార్దశ..
- 150 ఎకరాలకు పారుదల కాలువకు పూడికలను తీయించిన వీపీఆర్
- మా కుటుంబాలు ఉన్నంత కాలం వీపీఆర్కు రుణపడి ఉంటాం
150 ఎకరాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పారుదల కాలువ పూడికతీతలను తీయించారు. మండలంలోని హరిజనులు పండించుకునే పంటపొలాల్లో మధ్యలో ప్రవహించే సాయి కాలువ సుమారు 150 ఎకరాలకు జీవనాధారం. గత 27 సంవత్సరాల నుండి పూడికతీతలు తీయక రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై రైతులు మండల పరిషత్ కార్యాలయం నందు, గ్రీవెన్స్ లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి రైతులు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెంటనే స్పందించారు. రెండు రోజుల సమయంలోనే హిటాచ్చి మిషన్ పంపించి, కాలువ పూడికలను తీయించారు.
అక్కడున్న రైతులు మాట్లాడుతూ.. కాలువ పూడికలను తీయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా పెద్ద వాళ్లకాలం నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నామని, మాకు తెలిసి సాయి కాలువని ఎప్పుడూ తవ్వలేదని, కానీ ఇక్కడ నీళ్లు లేక బాధపడేవాళ్లమని, అందరికీ 4, 5 పుట్లు పండితే తాము 2 పుట్లు పండించుకుని ఎంతో బాధపడేవాళ్లమన్నారు. ఎంతో మందిని కలిసి చాలాసార్లు సాయి కాలువని తవ్వమని అడిగామని ఎవరూ పంట్టించుకోలేదని, అలాంటిది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అడగగానే ఈ పూడికతీత పనులు చేయించారన్నారు. మా కుటుంబాలు ఉన్నంతకాలం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి రుణపడి ఉంటామని రైతులు తెలిపారు. దీనికి సహకరించిన మండల ఇంచార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డికి, నాయకులకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాశం శ్రీహరి రెడ్డి, సత్యవోలు సత్యం రెడ్డి, పొన్నలూరు పురంధర్ రెడ్డి, గ్రామ నాయకులు రైతులు పాల్గొన్నారు.