మంత్రి నారాయ‌ణ‌కు పాలాభిషేకం

భగత్ సింగ్ కాలనీలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు

మంత్రి నారాయణ కు కృతజ్ఞతలు తెలిపిన

మంత్రి నారాయ‌ణ‌కు పాలాభిషేకం

భగత్ సింగ్ కాలనీలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు
మంత్రి నారాయణ కు కృతజ్ఞతలు తెలిపిన

నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో నివసిస్తున్న సుమారు 1400 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు కల్పించేందుకుమంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయణ రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రతిపాదన పెట్టి ఆమోదింప‌జేశారు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల సమన్వయంతో సాధ్యమైంది. ఈ సందర్భంగా నారాయణ కి కృతజ్ఞతగా 47వ డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో కుక్కలగుంట మహాలక్ష్మి గుడి సెంటర్ నందు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో VBS అధ్యక్షుడు కందుకూరు చంగయ్య ఆచారి, TNTUC అధ్యక్షుడు గోవిందరాజులు, VBS ట్రెజరర్ దండపాణి సురేష్, యూనిట్ ఇంచార్జ్ రెహమాన్, K. రాజా, BLC పిల్ల ప్రసాద్, ఆర్కాట్ శీను, వెంకటేశ్వర్లు, మహిళా టీం సారిక, చైతన్య
ముఖ్య నాయకులు: G. కళ్యాణ్, దువ్వు నరేంద్ర, కంచి చంద్ర, మేడ శీను, కంచి రామయ్య, వేలూరు రాజా, జయశంకర్, టి. చంద్ర, మనర్ స్వామి, ప్రసాద్, అల్లంపాటి వెంకటరమణ, రామిశెట్టి గిరిబాబు, చెన్నూరు గిరిధర్, పెంచలయ్య, M.కిష్టయ్య, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *