1400 మంది ఇళ్లపట్టాలకు అనుమతి తీసుకురావడం హర్షణీయం
47వ డివిజన్ ములుముడి బస్టాండ్ సెంటర్ లో మంత్రి నారాయణకు పాలాభిషేకం
పేదల చిరకాల కలను నిజం చేసిన మంత్రి
1400 మంది ఇళ్లపట్టాలకు అనుమతి తీసుకురావడం హర్షణీయం
47వ డివిజన్ ములుముడి బస్టాండ్ సెంటర్ లో మంత్రి నారాయణకు పాలాభిషేకం
నెల్లూరు నగరం.. వెంకటేశ్వరపురం.. భగత్సింగ్ కాలనిలో 1400 మంది నిరుపేద కుటుంబాలకు శాస్వత ఇంటి పట్టాలు అందించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంలో కృషి చేసిన మంత్రి నారాయణ చిత్రపటానికి స్థానిక 47వ డివిజన్.. ములుమూడి బస్టాండ్ సెంటర్లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, డివిజన్ ఇన్ఛార్జి డాక్టర్ గణేష్కుమార్ ఆధ్వర్యంలో పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, కార్యర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. మంత్రి నారాయణకు పాలాభిషేకం అనంతరం భారీ కేకు కోసి.. అందరికీ పంచిపెట్టారు. ఈసందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. పేదల చిరకాల కలను మంత్రి నారాయణ నిజం చేశారని.. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని కొనియాడారు. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించాలని రుజువు చేసే గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని పేర్కొన్నారు. త్వరలోనే వారందరికీ సీఎం చంద్రబాబునాయుడుచే పట్టాలు పంపిణీ జరగనుందని.. పొంగూరు నారాయణకు ప్రజలంతా జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ఇంకా ఈకార్యక్రమంలో గణేష్కుమార్, 49 డివిజన్ ఇంచార్జ్ ఖాదర్ భాషా లు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బూత్ కన్వినర్లు, బీఎల్వోలు, మహిళ, యూత్ టీమ్లతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.