అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో పోలీసులు వాట్ నెక్స్ట్
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మరో ముగ్గురు వైసీపీ,
ఆయన మీడియా ఆర్మీ 7 గురుపై పోలీసు కేసులు
సుకుమార్ రెడ్డి అరెస్టు ఉంటుందా..?
ఇప్పటికే రిమాండ్ లో నలుగురు విలేకరులు.
మిగిలిన నేతలు, విలేకరుల అరెస్టుపై కావలిలో ఒకటే చర్చ
అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎన్ త్రీ న్యూస్..
క్వాష్ పిటీషన్ దిశగా మాజీ ఎమ్మెల్యే…
- అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో పోలీసులు వాట్ నెక్స్ట్
- మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మరో ముగ్గురు వైసీపీ, ఆయన మీడియా ఆర్మీ 7 గురుపై పోలీసు కేసులు.
- సుకుమార్ రెడ్డి అరెస్టు ఉంటుందా..?
- ఇప్పటికే రిమాండ్ లో నలుగురు విలేకరులు. మిగిలిన నేతలు, విలేకరుల అరెస్టుపై కావలిలో ఒకటే చర్చ
- అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎన్ త్రీ న్యూస్..
కావలిలో అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, విలేకరులపై కేసులు నమోదు వ్యవహారం నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నలుగురు విలేకరులను జైలుకు పంపారు. ఇదంతా ఒక ఎత్తయితే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముఖ్యులు కేతిరెడ్డి బ్రదర్స్, శివకుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డిల అరెస్ట్ ఉంటుందా, ఇందుకులు తదుపరి పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏమిటన్న చర్చ కావలిలో జోరుగా సాగుతోంది. పోలీసులు అరెస్ట్ చేసే లోపలే ముందస్తు బెయిల్ కు వారంతా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే పై, మరో ముగ్గురు నేతలపై నమోదైన కేసు చెల్లదని, ఏకంగా కోర్టులో క్వాష్ పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. అదేవిదంగా రిమాండ్ లో ఉన్న విలేకరులకు బెయిల్, అరెస్ట్ కానీ మరో ముగ్గురు విలేకరులకు యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చేలా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. రిమాండ్ లో ఉన్న విలేకరి కొండయ్యకు సహాయం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే విముకుత చూపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ కేసులో ముద్దాయిగా ఉన్న కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి ఇంత వరకు స్పందించలేదు. ఈ కేసు నుంచి బయట పెడేందుకు ఆయన ఎలా వ్యూహాలు పన్నుతున్నాడో సర్వత్ర ఆసక్తి నెలకుంది.