40 ఏళ్ల సమస్యకు నారాయణ పరిష్కారం

భగత్ సింగ్ కాలనీ వాసులు కలను నెరవేర్చిన మంత్రి నారాయణ

1400 మందికి శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు_

40 ఏళ్ల సమస్యకు నారాయణ పరిష్కారం…

  • భగత్ సింగ్ కాలనీ వాసులు కలను నెరవేర్చిన మంత్రి నారాయణ
  • 1400 మందికి శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • ఏపీ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలన్నంటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకి మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. నగరంలోని భగత్ సింగ్ కాలనీ వాసుల 40 ఏళ్లను కలను నారాయణ నెరవేర్చారు. స్థానిక ప్రజల కోరిక మేరకు కేబినెట్ లో సొంత ఇంటి పట్టాలను మంజూరు చేయించారు. సుమారు 1400 మందికి పైగా లబ్ది చేకూరుతుంది అని ఆయన వెల్లడించారు. దీంతో భగత్ సింగ్ కాలనీ వాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈ రోజు ఒక పండుగ రోజు అని మంత్రి నారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేద‌ల ప‌క్షాన ఉంటుంద‌నే దానికి ఇదే నిద‌ర్శనమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *