గ్రామస్థులకి మెసేజ్ చేసిన ఓ వ్యక్తి
100 ఎకరాలపైన కన్నేసిన గ్రామస్థుడు
ప్రభుత్వ భూమిని చదును చేసేందుకు రంగంలోకి దించిన భారీ టాటా హిటాచీ వాహనం
అడ్డుకున్న గ్రామస్థులు వాచ్ ద ఎన్ 3 న్యూస్
మీ…ఎమ్మెల్యేకి కాల్ చేసుకో…
- గ్రామస్థులకి మెసేజ్ చేసిన ఓ వ్యక్తి
- 100 ఎకరాలపైన కన్నేసిన గ్రామస్థుడు
- ప్రభుత్వ భూమిని చదును చేసేందుకు రంగంలోకి దించిన భారీ టాటా హిటాచీ వాహనం
- అడ్డుకున్న గ్రామస్థులు
- వాచ్ ద ఎన్ 3 న్యూస్
నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం గ్రామంలో సర్వే నెంబర్ 540 నుండి 590 వరకు దాదాపు 100 ఎకరాలు పైగా వున్న ప్రభుత్వ భూమిపై గ్రామస్థుడు కన్నేశాడు. రాజుపాళెం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి గతంలో బినామీ పేర్లు పెట్టి డి పారం పట్టాలు చేయించడంతో తెలుగురాయిపురం గ్రామస్తులు కోర్టుని ఆశ్రయించారు.. అయితే గత 30 ఏళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మొక్కలు తొలగించడానికి భారీ టాటా హిటాచీ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆ భూమిలో దించారు.. ఇది తెలుసుకున్న సర్పంచ్ రమణమ్మ ,మాజీ ఎంపీటీసీ నారాయణ రెడ్డి, గ్రామస్తులు భూములను అనధికారికంగా చదును చేయుటకు వచ్చిన హిటాచీ వాహనాన్ని అడ్డగించడంతో భయంతో ఆపరేటర్లు పారిపోయారు. హిటాచీ వాహనాన్ని భూముల్లో నుంచి తీసి వేయాలని గ్రామస్తులు హిటాచీ వాహనం పై నంబర్ కి కాల్ చేయగా అతను తిరిగి గ్రామస్థులకు ఫోన్ చేసి మీ ఎంఎల్ఎ కి కాల్ చేసుకోండి.. అని వెంకటగిరి ఎంఎల్ఎ కురుగుండ్ల రామకృష్ణ నెంబర్ గ్రామస్థులకు మెసేజ్ చేశాడు..అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్వో 100 ఎకరాలు పైగా భూమి ప్రభుత్వ అధీనంలోనే ఉందని ఎన్ని సార్లు బోర్డు ఏర్పాటు చేసిన తొలగిస్తున్నారని తెలిపారు.. కలువాయి తాసిల్దార్ శ్యామసుందర్ రాజ ఆదేశాలుతో టాటా హిటాచిపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించడం జరుగుతుందని విఆర్ఓ లక్ష్మీదేవి తెలిపారు..