అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
పోలేరమ్మ ఉత్సవాల్లో వేమిరెడ్డి…
- అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలం దామరమడుగు పల్లిపాళెం గ్రామలో పోలేరమ్మ తల్లి ఆలయ ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామస్థులతో కలిసి ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి అపూర్వ స్వాగతం పలికారు. విశేష పూజలు నిర్వహించి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గండవరపు రామచంద్రయ్య, గండవరపు లక్ష్మయ్య, చేజర్ల మహేష్, మట్టిపల్లి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.