కొత్త అల్లుడు రాక‌… అంబ‌రాన్నంటిన సంబురాలు

అంకురార్ప‌ణ‌తో ఘ‌నంగా పెంచ‌ల‌కోన బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

ఆల‌యం నుంచి గిరిజ‌న‌వాడ అత్తారింటికి ప‌ల్ల‌కిలో ఊరేగుతూ

దేవేరుల‌తో వెళ్లిన ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి

ఆచార‌, మ‌ర్యాద‌ల‌తో స్వామివారికి సారె

కొత్త అల్లుడు రాక‌..
అంబ‌రాన్నంటిన సంబురాలు

  • అంకురార్ప‌ణ‌తో ఘ‌నంగా పెంచ‌ల‌కోన బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం
    -ఆల‌యం నుంచి గిరిజ‌న‌వాడ అత్తారింటికి ప‌ల్ల‌కిలో ఊరేగుతూ..
    దేవేరుల‌తో వెళ్లిన ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి

ఆచార‌, మ‌ర్యాద‌ల‌తో స్వామివారికి సారె

నెల్లూరు జిల్లా రాపూరు మండలం పుణ్యక్షేత్రమైన దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు గోనుపల్లి గ్రామంలో పెంచల స్వామి దేవాలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మేళ తాళాలతో, తప్పెట్లు, భాజ భజంత్రుల నడుమ ఉభయ దేవేరులతో కలిసి శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వ‌హించుకునేందుకు అత్తారింటి నుండి కోనకు బయలుదేరాడు. ముందుగా గోనుపల్లి పెంచల స్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలు పల్లకిలో గిరిజ‌న‌వాడ‌లోని చెంచులక్ష్మి అమ్మ వారి ఇంటికి చేరుకోవటంతో కొత్త అల్లుడు రాకతో ఆ వాడ‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇంటికి వచ్చిన అల్లుడికి తమ ఆచారం ప్రకారం పుట్ట తేనె, ఇంజేటి గడ్డలు, నారే మొలతాడును సారేగా ఇచ్చారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో పెంచలకోనకు కాలినడకన చేరుకున్నారు. గ్రామంలో అడుగడుగున స్వామి వారికీ భక్తులు టెంకాయ.. కర్పూరం సమర్పించి బ్రహ్మోత్సవాలకు పెంచలకోనకు సాగనంపారు, నేటి నుంచి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *