పైలాన్ ధ్వంసం చేసిన వారిపై చర్యలు ఉంటాయని నాడే చెప్పాం
కావాలి నియోజకవర్గంలో ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి లు సర్వం దోచేశారు
మీడియా సమావేశంలో జనసేన యువ నాయకుడు సిద్దు సంచలన వ్యాఖ్యలు
సినిమా టిక్కెట్లనుకూడా వదలని మాజీ ఎమ్మెల్యే
- పైలాన్ ధ్వంసం చేసిన వారిపై చర్యలు ఉంటాయని నాడే చెప్పాం
-కావాలి నియోజకవర్గంలో ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి లు సర్వం దోచేశారు.
మీడియా సమావేశంలో జనసేన యువ నాయకుడు సిద్దు సంచలన వ్యాఖ్యలు
కావలి నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు రామ లక్ష్మణలుగా చెప్పుకున్న
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి పాలన ఎలాసాగిందో ప్రజలందరికీ తెలుసని, దోపిడి, దౌర్జన్యాలతో సాగిన విషయం ఎవరికీ తెలియదని కావలి యువనేత సిద్దు తెలిపారు. కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో సిద్ధూ మాట్లాడారు. పైలాన్ ధ్వంసం ఎవరు చేయించారని.. ఏ చిన్నపిల్లాడిని అడిగినా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిలే చేయించారని చెబుతారన్నారు. నాడు పోలీసులు కేసు నమోదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తె కచ్చితంగా చర్యలు తీసుకుంటామని నాడే చెప్పామన్నారు. వారి దౌర్జన్యాలపై వార్తలు రాసే విలేకరులను వెంటబడి కొట్టించలేదా అని ప్రశ్నించారు. చివరకు సినిమా టిక్కెట్లు అమ్మించిన నీచమైన చరిత్ర వైసిపి నాయకులది అన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే పోలీసు స్టేషన్లలో పెట్టించడం తాము మరిచిపోలేదన్నారు. ఒక ఎమ్మెల్యేగా పనిచేసానని ప్రతాప్ కుమార్ రెడ్డి తన గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలడా అని సిద్దు ప్రశ్నించారు. షాడో ఎమ్మెల్యేగా సుకుమార్ రెడ్డి ని పెట్టి కావలి నియోజకవర్గంలో సర్వం దోచుకుని ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారని సిద్దు ఎద్దేవ చేశారు. ప్రశ్నించిన వారందరినపై దాడులు చేయించలేదా అని ఆయన ప్రశ్నించారు.