గత రాత్రి పరిణామాలతో అప్రమత్తమైన నెల్లూరు పోలీసులు
ఫైర్, పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక మాక్ డ్రిల్
దాడులు జరిగితే ఏం చేయాలి ఎలా చేయాలి అనే అంశాలపై డ్రిల్
వైమానిక దాడి జరిగితే….
- గత రాత్రి పరిణామాలతో అప్రమత్తమైన నెల్లూరు పోలీసులు
- ఫైర్, పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక మాక్ డ్రిల్
- దాడులు జరిగితే ఏం చేయాలి ఎలా చేయాలి అనే అంశాలపై డ్రిల్
గత రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో…ఒకవేళ ఏదైనా వైమానిక దాడులు జరిగితే… ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశంపై మాక్ డ్రిల్ జరిగింది. నెల్లూరు జిల్లా…ముత్తుకూరు మండలం అదాని కృష్ణపట్నం పోర్ట్ లో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ రావ్ , ఎఆర్ డిఎస్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. ముత్తుకూరు, కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఫైర్, ముత్తుకూరు రెవెన్యూ సిబ్బంది, పోర్ట్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈ డ్రిల్ జరిగింది. పోర్ట్ లో పనిచేస్తున్న సిబ్బందికి, తీర ప్రాంత వాసులకు దాడులు ఎలా జరుగుతాయి… ఆ సమయాలలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి…దాడుల్లో ఒకవేళ గాయపడితే వైద్యసహాయం ఎలా పొందాలి తదితర అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. అనంతరం ఇద్దరు డిఎస్పీ లు మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అదేశాలో… జిల్లా… కలెక్టర్, ఎస్పీ సూచనలతో ఈ ప్రత్యేక డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ స్వప్న, సిఐ రవినాయక్, ఎంపీడీఓ నాగమణి, ఎసై లు జేపీ శ్రీనివాస రెడ్డి, విశ్వనాథ రెడ్డి, అంజిరెడ్డి, వీరేంద్రబాబు… పోర్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.