రైతుల అవసరాల మేరకు నీటి విడుదల
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
రెండో పంటకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి
రైతాంగ ప్రయోజనాలే కూటమి లక్ష్యం…
- రైతుల అవసరాల మేరకు నీటి విడుదల
- మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- రెండో పంటకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి
నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సోమశిల జలాశయం కింద 3.60 లక్షల ఎకరాలకు 44 టిఎంసీలు, తెలుగు గంగ ప్రాజెక్టు కింద 1.60 లక్షల ఎకరాలకు 16 టిఎంసీలు నీటిని నేటి నుంచి రైతుల అవసరాల మేరకు విడుదల చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం గంగమ్మ తల్లికి చీర సారే… జలహారతి సమర్పించి నీటిని విడుదల చేసారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు..రైతాంగ ప్రయోజనాలే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. రైతులకి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, టీడీపీ మండల అధ్యక్షురాలు మునగపాటి సునీత, టీడీపీ నాయకులు కృష్ణ రెడ్డి, తదితరులు ఉన్నారు.