హత్యలకు కారణం ఇదే..

మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలి

ఐద్వా, డీవైఎఫ్ఐ డిమాండ్

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన

హత్యలకు కారణం ఇదే…

  • మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలి
  • ఐద్వా, డీవైఎఫ్ఐ డిమాండ్
  • ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన

మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర యువజన సంఘం నేతలు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుండి ముత్తుకూరు గేటు సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి. షేక్ మస్తాన్ బి మాట్లాడుతూ… నెల్లూరులో జరుగుతున్న వరుస దారుణ హత్యలకు నెల్లూరు ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారన్నారు. ఈ హత్యలకు ప్రధాన మూల కారణం మద్యం, మత్తు పదార్ధాలేన్నారు. పాలకులు స్పందించి మద్యం, మత్తు పదార్థాలను నిషేధించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శివకుమారి, నగర అధ్యక్ష కార్యదర్శులు పద్మ ఎన్.వి. సుబ్బమ్మ, రూరల్ 5వ అధ్యక్షురాలు ఎస్ వరలక్ష్మి, శంషాద్, ప్రమీల, కే లక్ష్మమ్మ, ఎస్ సంపూర్ణమ్మ, డివైఎఫ్ఐ నాయకులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *