మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు, అధికారులతో చర్చ
రాజధాని భూ కేటాంపులపై మంత్రి నారాయణ సమావేశం
-మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు, అధికారులతో చర్చ
అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సెక్రటేరియట్ లో.. తన ఛాంబర్ లో మంత్రి కొల్లురవీంద్రతో పాటు ఉపసంఘం సభ్యులు, అధికారులతో నారాయణ సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు. గతంలో వివిధ సంస్థలకు కేటాయించిన విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, కొన్ని సంస్థలకు వివిధ కారణాలతో రద్దు, కొత్తగా కొన్ని సంస్థలకు భూ కేటాయింపుల విషయమై ఉప సంఘం చర్చించింది. దీనిపై అందరికీ మంత్రి నారాయణ దిశ నిర్థేశం చేశారు. ఈ సమావేశానికి జూమ్ ద్వారా మంత్రలు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్ లు హాజరయ్యారు.