ప్రత్యక్షంగా లొంగిపోతా

తనపై కేసు నమోదులో డైరెక్షన్ సూపర్

కాపుకాచే నేతకు వడ్డీతో సహా చెల్లిస్తా

పైలాన్ ధ్వంసంపై తనపై నమోదైన కేసు పట్ల స్పందించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి

ప్రత్యక్షంగా లొంగిపోతా..

  • తనపై కేసు నమోదులో డైరెక్షన్ సూపర్
  • కాపుకాచే నేతకు వడ్డీతో సహా చెల్లిస్తా
  • పైలాన్ ధ్వంసంపై తనపై నమోదైన కేసు పట్ల స్పందించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి

కావలిలో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేసిన కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలపై కేసులు నమోదును మంగళవారం కావలి నియోజకవర్గ వైసీపీ నాయకులు ఖండించారు. కావలిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తుండడంతోనే ఎప్పుడో మూసేసిన కేసును మళ్లీ ఓపెన్ చేసి అక్రమకేసులు పెట్టారన్నారు. అదేవిదంగా తనపై నమోదైన కేసు పట్ల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు. బెంగుళూరు నుంచి మీడియా సమావేశంలో తన స్పందనను ఫోన్ ఆడియో ద్వారా తెలియజేశారు. తనపై నమోదైన అక్రమ కేసు వెనుక కావలిని కాపుకాచే నేత పనేనని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఉద్దేశించి తెలిపారు. ఆయన సూపర్ డైరెక్షన్లో పోలీసులు కేసులు పెట్టారన్నారు. ఇవన్నీ తమకు గుణపాఠాలేనని, మాకు అవకాశం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. పోలీసులు తనకోసం వెతకవద్దని, తానే వేలాదిమంది వైసీపీ కార్యకర్తల సమక్షంలో లొంగిపోతానని చెప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, వెంకటేశ్వర్లు రెడ్డి , రఘు, కనుమర్లపూడీ నారాయణ, నాయబ్ రసూల్, కుందుర్తి కామయ్య , గుడ్లూరు మాల్యాద్రి, చిన పుల్లయ్య , జీవీ, కళ్యాణి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *