బాలాజీరావుపేట గ్రామంలో విచారణ చేపట్టిన డీవీవో విజయలక్ష్మి
ఉపాధి హామీ పథకంలో అవినీతిపై గ్రామస్థులు ఫిర్యాదు…
- బాలాజీరావుపేట గ్రామంలో విచారణ చేపట్టిన డీవీవో విజయలక్ష్మి
నెల్లూరు జిల్లా కలువాయి బాలాజీరావుపేట గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతి జరిగిందని అధికారులకి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్ష్మీ బాలాజీ రావుపేటలో విచారణ చేపట్టారు. పాధి హామీ పథకం లో బినామీ మస్టర్ లు వేసి కూలీల నగదు మేట్ లు డ్రా చేసి అవినీతికి పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. బినామీ మస్టర్ లు వేయడం వలన కూలీలకు అన్యాయం జరుగుతుందని విజిలెన్స్ అధికారి తెలిపారు. ఉపాధి హామీలో పనిచేసే కూలీలను నగదు ఎక్కడ నుంచి డ్రా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు ఉపాధి హామీ ఏపీడి గాయత్రీ దేవి, కలువాయి ఏపీఓ సునీల్, టి ఎ శ్రీను, బి ఎఫ్ టీ ఏడుకొండలు,కూలీలు వున్నారు..