ఆర్టీసీలో అప‌రిష్కృత స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి

ఘ‌నంగా ఎన్ఎంయూ నెల్లూరు జోన‌ల్ ప్ర‌థ‌మ మ‌హాస‌భ‌

ఆర్టీసీలో అప‌రిష్కృత స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి

ఘ‌నంగా ఎన్ఎంయూ నెల్లూరు జోన‌ల్ ప్ర‌థ‌మ మ‌హాస‌భ‌

ఏపీఎస్ ఆర్టీసీ నేష‌న‌ల్ మ‌జ్దూర్ యూనియ‌న్ నెల్లూరు జోన‌ల్ ప్ర‌థ‌మ మ‌హాస‌భ సోమ‌వారం నెల్లూరు న‌గ‌రంలోని పుర‌మందిరంలో ఆ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షులు పీవీ ర‌మ‌ణారెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వైవీ ర‌మ‌ణారెడ్డి, నాన్ కోఆప‌రేటివ్ గౌర‌వ అధ్య‌క్షులు గాదిరాజు అశోక్‌కుమార్‌రెడ్డి, జోన‌ల్ కార్య‌ద‌ర్శి లెక్స‌న్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యతిథిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి హాజ‌ర‌య్యారు. ఈసందర్భంగా ప‌ట్టాభి మాట్లాడుతూ.. మిమ్మ‌ల్ని అంద‌ర్నీ క‌లుసుకోవ‌డం.. కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకున్నంత ఆనందంగా ఉంద‌న్నారు. ఆర్టీసీలో ఉద్యోగ‌, కార్మికుల‌కు సంబంధించిన అప‌రిష్కృత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు చర్య‌లు తీసుకుంటాన‌ని.. అలాగే.. ప్ర‌భుత్వం వ‌ద్ద‌నున్న స‌మ‌స్య‌ల‌ను కూడా.. సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్‌, ట్రాన్స్‌పోర్టు మినిస్ట‌ర్‌ల దృష్టికి తీసుకెళ్లి.. ఆయా స‌మ‌స్య‌ల‌ను సైతం ప‌రిష్క రించేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌న్నారు. ఆర్టీసీలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకు కూట‌మి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని.. అలాగే.. కార్మికులు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ముందుకెళ్తుంద‌న్నారు. ఆర్టీసీలో కొత్త బ‌స్సుల కొనుగోళ్లు, కొత్త ఉద్యోగాలు కూడా వ‌చ్చేలా అంద‌రం కృషి చేయాల‌న్నారు. ఇంకా ఆర్టీసీ ఉద్యోగ‌, కార్మికుల స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న మాట్లాడారు. అనంత‌రం ఆ యూనియ‌న్ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శుల‌తోపాటు ప‌లువురు మాట్లాడారు. అనంత‌రం ప‌ట్టాభిని ఆ యూనియ‌న్ ఐదు జిల్లాల జోన‌ల్ గౌర‌వాధ్య‌క్షునిగా ఎన్నుకుని.. ఘ‌నంగా గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *