దారుణం వెనకున్న కుటుంబాలను జిల్లాలో లేకుండా చేయాలి
డిమాండ్ చేసిన కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న
వైసీపీ నేత హత్యపై చిత్తశుద్ధితో విచారణ జరిపించాలి
-హత్యవెనకున్న కుటుంబాలను జిల్లాలో లేకుండా చేయాలి
-డిమాండ్ చేసిన కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న
ఈ మధ్య బుచ్చి మండలంలో పోలినాయుడు చెరువు గ్రామంలో తమ పార్టీ నాయకుడుని క్రూరంగా చంపేశారని.. రాజకీయాల్లో.. విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. అంతేగాని.. హత్యా రాజకీయాలు చేయకూడదంటూ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి హితవు పలికారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో..ఎన్నో హత్యలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ఆయన బుచ్చిరెడ్డిపాళెంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. తమ నేత హత్యపై నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో, నిజాయితీగా విచారణ చేయించాలని ఆయన కోరారు. హత్య జరిగిన గ్రామంలో తెలంగాణకు సంబంధించి.. స్థిరపడ్డ వ్యక్తులే హత్యకు పాల్పడ్డారని.. ఈ హత్య వెనుక ముగ్గురు వ్యక్తులున్నారని.. వారిని బయటకు లాగాలని ఈసందర్భంగా ప్రసన్న డిమాండ్ చేశారు. హత్య వెనుక ఉన్న ఆ కుటుంబాలను జిల్లాలో ఉండకుండా చేయాలని.. దీనికి ఎంపీ, ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు.