నెల్లూరు వీఆర్సీ సెంటర్లో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
ప్రయాణికులకు, పాదచారులకు మజ్జిగ పంపిణీ
వేసవి తాపానికి చలివేంద్రాలు ఉపశమనం
- నెల్లూరు వీఆర్సీ సెంటర్లో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
- ప్రయాణికులకు, పాదచారులకు మజ్జిగ పంపిణీ
నెల్లూరు వీఆర్సీ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిటీ వైసీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ప్రయాణికులకు, పాదచారులకు ఆయన మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నగర నియోజకవర్గంలో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. మరో రెండు రోజుల్లో మరి కొన్ని చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటూకూరు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.