మంత్రి నారాయ‌ణ నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు అన్యాయం

బ‌ర్మాషాల్‌గుంట‌రైల్వేప్రాంత బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి

బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా

మంత్రి నారాయ‌ణ నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు అన్యాయం

  • బ‌ర్మాషాల్‌గుంట‌రైల్వేప్రాంత బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి
  • బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా

కూట‌మి ప్ర‌భుత్వం 150 అత్యంత నిరుపేద కుటుంబాల వారిని రోడ్డున ప‌డేయ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిప‌డ్డారు. నెల్లూరులోని 52వ డివిజ‌న్ బ‌ర్మాషాల్ గుంట రైల్వే ప్రాంతంలో ఉన్న నిరుపేద కుటుంబాల వారిని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఎమ్మెల్సీని చూడ‌గానే బాధితులంతా వ‌చ్చి త‌మ గోడును వెల్ల‌గ‌క్కారు. త‌మ‌కు ప్ర‌య‌త్నం చూపించేలా మార్గం చూపాలంటూ విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఫోన్‌లో ఆయా శాఖ‌ల అధికారుల‌తో మాట్లాడారు. బ‌ర్మాషాల్‌గుంట రైల్వే ప్రాంతంలోని వారికి ప్ర‌త్య‌మ్నాయం చూపించాల‌ని వారి తెలిపారు. అధికారులను ఒప్పించి పేద వారికి ప్రత్యమ్నాయం చూపే వరకు బలవంతంగా ఖాళీ చేయించ వద్దని కోరారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాలుగా 150 కుటుంబాలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అయితే అర్ధాంతరంగా నిన్నటి రోజున రైల్వే అధికారులు.. వచ్చి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, లేదంటే జెసిబి లతో మీ ఇళ్ళ ను 6 వ తేదీ సాయంత్రం కూల్చేస్తామంటూ పేదలను భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయమన్నారు. సాక్షాత్తు మంత్రి నారాయణ సొంత నియోజకవర్గంలోని పేదలకు అన్యాయం జరుగుతుంటే మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్ర‌శ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *