బహిరంగ సభలో గొప్పలు, ప్రజలకు తిప్పలు

20 ఏళ్లుగా అగ‌చాట్లు ప‌డుతున్న చెలికల గ్రామ ప్రజలు

గుంతల రోడ్లలో ప్రయాణం – రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు

పట్టించుకోని అధికారులు

బహిరంగ సభలో గొప్పలు, ప్రజలకు తిప్పలు

  • 20 ఏళ్లుగా అగ‌చాట్లు ప‌డుతున్న చెలికల గ్రామ ప్రజలు
  • గుంతల రోడ్లలో ప్రయాణం
  • రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు
  • పట్టించుకోని అధికారులు

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చెలికల గ్రామంలో గ‌డిచిన 20 ఏళ్లుగా ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ విష‌య‌మై సంబంధిత శాఖాధికారుల‌ను ఎన్నిమార్లు చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. ప్ర‌ధానంగా గ్రామం నుంచి విడవలూరుకు వచ్చే రోడ్డు మార్గం అంతర్గతంగా ఇబ్బంది ఉంది. దీంతో వాహనదారులకు ప్రమాదాలు తప్పడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డు సమస్యపై అధికారులకు, నాయకులకు ఎన్ని సార్లు తెలిపిన కన్నెత్తి చూసిన వారే లేరని వాపోయారు. మూలిగే నక్కపై తాటికాయపడినట్లుగా అంతర్గతంగా ఉన్న రోడ్లలో ప్రయాణం న‌ర‌కంగా సాగుతుంది. ఇదిచాల‌దా అన్న‌ట్లు రోడ్డుని కొంద‌రు ఆక్రమించుకొని రాకపోకలకు అంతరం కలిగిస్తున్నారు. ఇటువైపు అధికారులు వస్తూ, వెళ్తుంటారే తప్ప పట్టించుకునే వారు లేరని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అంతర్గతంగా ఉన్న రోడ్డుకు మరమ్మత్తులు, రోడ్డును ఆక్రమణకు గురి చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *