పోలీస్ ప్ర‌జా వేదిక‌కు 101 అర్జీలు

పిర్యాదుదారుల‌తో మాట్లాడిన ఎస్పీ కృష్ణ‌కాంత్

వ‌చ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ

పోలీస్ వేదిక‌కు 101 అర్జీలు

  • పిర్యాదుదారుల‌తో మాట్లాడిన ఎస్పీ కృష్ణ‌కాంత్
  • వ‌చ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ

నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జ‌రిగింది. జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వ‌ద్ద నుంచి సమస్యల వినతులను స్వీకరించారు. పిర్యాదుదారుల‌తో ఎస్పీ మాట్లాడారు. వారి స‌మ‌స్య‌ల‌ను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 101 ఫిర్యాదులు వచ్చాయ‌ని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిషనల్ యస్.పి. CH.సౌజన్య, ఉమెన్ PS DSP రామారావు, SB DSP శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి, SB-2 CI శ్రీనివాసరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *