కట్టుగూడెంలో పేకాటస్థావరంపై పోలీసుల దాడులు
రూ.46,310 నగదు, 8 సెల్ ఫోన్లు, ఒక కారు, ఒక బైకు, 204 ప్లే కార్డ్స్ స్వాధీనం
8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్… మరోకరు పరార్
పేకాట ఆడితే కఠిన చర్యలు
- కట్టుగూడెంలో పేకాటస్థావరంపై పోలీసుల దాడులు
- రూ.46,310 నగదు, 8 సెల్ ఫోన్లు, ఒక కారు, ఒక బైకు, 204 ప్లే కార్డ్స్ స్వాధీనం
- 8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్… మరోకరు పరార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కట్టు గూడెంలోని పెంకు ఫ్యాక్టరీలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మంది పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా… వారిలో కాంగ్రెస్ నాయకుడు ధనుంజయ పరారయ్యాడు. మిగిలిన 8 మందిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి 46,310 నగదు రూపాయలు, 8 సెల్ ఫోన్లు, ఒక కారు, ఒక బైకు, 204 ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా పెంకు ఫ్యాక్టరీ యజమాని బండారి వెంకన్న, ఇల్లందుకు చెందిన గడ్డం రాజశేఖర్, పిల్లి అశ్విక్, మల్లారపు రమేష్, మహబూబాబాద్ కు చెందిన గన్నం చంద్రశేఖర్, గంధంపల్లికి చెందిన నిమ్మగడ్డ నరేంద్రబాబు, నర్సంపేటకు చెందిన గూళ్ల ప్రకాష్, ఇల్లందు సుభాష్ నగర్ కు చెందిన ఉరుకొండ ధనుంజయులు కేసులో ఉన్నారు. ఈ సందర్భంగా ఇల్లందు సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. పేకాట ఎవరు ఆడిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు