సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా నిరుపేదలకు చంద్రబాబు ఆర్థిక భరోసా
నియోజకవర్గ పరిధిలో ఆరుగురికి.. 6 లక్షల 46,553 రూపాయలు
కోవూరు ప్రజానీకం తరఫున చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంతి
సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా నిరుపేదలకు చంద్రబాబు ఆర్థిక భరోసా..
నియోజకవర్గ పరిధిలో ఆరుగురికి.. 6 లక్షల 46,553 రూపాయలు..
కోవూరు ప్రజానీకం తరఫున చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంతి..
ఆరోగ్యం, ఆనంద సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు.. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఆమె… కోవూరు నియోజకవర్గ పరిధిలో ఆరుగురికి, ఆరు లక్షల 46 వేల 553వందల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందివ్వాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమన్నారు.. సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా వేలాది కుటుంబాలను ఆదుకుంటూ మానవత్వం చాటుకుంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడుని ప్రశాంతి రెడ్డి కొనియాడారు.. ఆమె వెంట టిడిపి నేతలు.. ఇంత మల్లారెడ్డి, బెజవాడ వంశీకృష్ణ రెడ్డి, మోర్ల మురళి, తదితరులు ఉన్నారు..