గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులే
నెల్లూరులో అట్టహాసంగా పేర్నాటి నేచురల్స్ ప్రారంభోత్సవం
పేర్నాటి నేచురల్స్ లో
గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులే
- నెల్లూరులో అట్టహాసంగా పేర్నాటి నేచురల్స్ ప్రారంభోత్సవం
గో ఆధారిత వ్యవసాయం ద్వారా తమ సొంత పొలాల్లో పండించిన ఆర్గానిక్ పంటలను అందరికి అందుబాటులో తెచ్చేందుకే పేర్నాటి నేచురల్స్ ప్రారంభించడం జరిగిందని ఆ సంస్థ అధినేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లో పేర్నాటి నేచురల్స్ స్టోర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పేర్నాటి నేచురల్స్ వ్యవస్థాపకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, హేమ సుష్మితా దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశ సంతతికి చెందిన 250 గోవుల ఆధారంగా తమ ఫాంలో పండించిన సేంద్రియ ఉత్పత్తులను ఈ స్టోర్ ద్వారా జిల్లా ప్రజానికానికి అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పారు. కల్తీలేని పాలు, కెమికల్స్ లేని నూనెలు వాడకాన్ని ముందుగా తాము ఉపయోగించి ఆ ప్రయోజనాలు చూసిన తరువాత అందరికి అటువంటి ఆహార పదార్ధాలు అందించాలన్న ఉద్దేశంతో పేర్నాటి నేచురల్స్ ప్రారంభించడం జరిగిందని తమ స్టోర్ ద్వారా అందుబాటులో ఉన్న సేంద్రియ ఉత్పత్తులను జిల్లా ప్రజానికం సద్వినియోగం చేసుకొని ఆరోగ్యగంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో పేర్నాటి కుమార్తె బింధు ఐశ్వర్య, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు పాల్గొన్నారు.