టెర్రస్ గార్డెన్ టూ 250 ఎకరాలు, 250 ఆవులు
PN అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డితో ఫేస్ టూ ఫేస్
పేర్నాటి నేచురల్స్ బ్యాక్ గ్రౌండ్ ఇదే….
- టెర్రస్ గార్డెన్ టూ 250 ఎకరాలు, 250 ఆవులు
- PN అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డితో ఫేస్ టూ ఫేస్
నేటి ఆధునిక జీవితంలో ఆహారమే అన్నీ రోగాలకు మూలం అవుతున్న నేపథ్యంలో అదే ఆహారమే ఔషధంగా కూడా పని చేస్తుందని ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం…అయితే ఆహారమే ఔషధంగా మారాలంటే కేవలం సేంద్రియ వ్యవసాయ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనేది ఎవరు కాదన్నా వాస్తవం. ఈ క్రమంలో సేంద్రియ వ్యవసాయం చేసేవారు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ, ఆర్గానిక్ ప్రాడెక్ట్స్ అమ్మే
స్టోర్స్ మాత్రం పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అటువంటి స్టోర్స్ కి పూర్తి వ్యతిరేకంగా 250 ఆవులతో, 250 ఎకరాల తమ సొంత భూములలో సేంద్రియ పద్దతిలో పండించిన గో ఆధారిత పంటలను అందరికి వాడుకలోకి తెచ్చేందుకు పేర్నాటి నేచురల్స్ పేరుతో ఒక స్టోర్ ను నెల్లూరులో ప్రారంభించారు. టెర్రస్ గార్డెన్ నుంచి ప్రారంభించి నేడు 250 ఎకరాలలో సేంద్రియ పంటలు పండించి ఆరోగ్యకరమైన సమాజం కోసం అందుబాటులోకి తెచ్చామంటున్న పేర్నాటి నేచురల్స్ అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి విజయకృష్ణ వన్ టూ వన్….