నారాయణ విద్యా సంస్థల జీఎం వీబీఆర్
కుక్కలగుంటలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన వి.బి.ఆర్
పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
- నారాయణ విద్యా సంస్థల జీఎం వీబీఆర్
- కుక్కలగుంటలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన వి.బి.ఆర్
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పేదల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రంతోపాటు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని స్థానిక కుక్కలగుంట మహాలక్ష్మి గుడి వద్ద స్థానిక టిడిపి యూత్ క్లస్టర్ దువ్వూరు సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ను విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వి.బి.ఆర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. అందుకు అనుగుణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని నిరుపేదల కోసం ఇటువంటి మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను వీబీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్ భర్త ఇంతియాజ్, 47 వ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ పొట్లూరి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఆర్కాట్ కుమార్, దండపాణి సురేష్, యూత్ నాయకులు, ఎన్ టీం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.