మీడియా ఎదుట వాపోయిన రైతు గడ్డం వెంకటరత్నమ్మ
తమ పొలాన్ని ఇప్పించండి…
- మీడియా ఎదుట వాపోయిన రైతు గడ్డం వెంకటరత్నమ్మ
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో గడ్డం వెంకట రత్నమ్మ తన పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ… గతంలో తమ పొలాన్ని కౌలుకి చేస్తున్న సురేంద్ర అనే వ్యక్తి పొలంలోకి రావద్దని చెపితే పొలంలో నారు పోసి వరి పంట అనంతరం… మార్చి నెల నుండి పొలంలోకి రానని పోలీసుల సమక్షంలో రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు తన కూతుళ్ళకు రాసిచ్చిన పొలంలో వరిని పొలం చేసుకోనీకుండా మళ్ళీ తమ పొలంలో విత్తనాలు చల్లి మా పొలాన్ని మాకు అప్పజెప్పకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము పొలం దగ్గరకు వచ్చేసరికి మమ్మలను చూసి పిలుస్తున్నా ఆగకుండా పారిపోయాడని వాపోయారు. ఈ విధంగా దొంగతనంగా నార్లు పోస్తూ అడిగితే మరలా పంట కోశాక ఇస్తానని ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. పోలీసులు దయచేసి సురేంద్ర కౌలు దారుడి నుండి తమ పొలాన్ని మాకు ఇప్పించాలని కోరుతున్నారు.