శశిధర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మేకపాటి
- శశిధర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దీపురం గ్రామంలో ఇటీవల పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రా రెడ్డి కుటుంబాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శించారు .ఈ సందర్భంగా విద్యార్థి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం సంగంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి సోదరుడు శశిధర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. మృతికి గల కారణాలు తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, చంద్రారెడ్డి, అధికార ప్రతినిధి కరిముల్లా, చందు, శివకుమార్, కోటారెడ్డి, పోలిశెట్టి ఆంజనేయులు, రామారావు,మహేష్ తదితరులు పాల్గొన్నారు.