ఉద్యానవనం కానున్న అనపగుంట

కావలిలో అనపగుంట సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల వాగ్దానం

పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయించి పూడికతీత పనులు

పర్యాటకంగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే

ఉద్యానవనం కానున్న అనపగుంట..

  • కావలిలో అనపగుంట సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల వాగ్దానం
  • పరిష్కారానికి రూ.20 లక్షలు కేటాయించి పూడికతీత పనులు
  • పర్యాటకంగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే

కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కావలి పట్టణంలోని వైకుంఠపురం వచ్చినప్పుడు ఇక్కడి అనపగుంట సమస్యను చెప్పారు. కావలి రైల్వే ట్రాక్ కు పడమర వైపు ఉన్న ప్రాంతాల మురుగు నీరంతా ఈ అనపగుంటకు చేరి దుర్గంధ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిదంగా వర్షాకాలం ముంపు, బావులు, బోర్లకు కలుషిత నీరు వస్తున్నట్లు తెలిపారు. దీంతో నాడు ఇచ్చిన హామీ మేరకు అనిపగుంటలో నీరంతా బయటకు తోడించి, రూ.20 లక్షల నిధులతో పూడిక తీయిస్తున్నారు. ఈ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దుర్గంధమైన ఈ ప్రాంతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతానని తెలిపారు. ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించే వరకు ఇటుగా బాట ఓ వైపు, మురుగు నీరు నిలవలేకుండా మరో వైపు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *