డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే
సోమిరెడ్డితో మెట్టుకూరు భేటీ
- డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే
నెల్లూరు డీసీసీబీ చైర్మన్ గా మెట్టుకూరు ధనుంజయరెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. అనంతరం ధనుంజయరెడ్డికి సోమిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సత్కరించారు.