రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడల అభివృద్ధికి నెల్లూరు నుండి శ్రీకారం
మీడియా సమావేశంలో మంత్రి ఆనం
రేపు ఆత్మకూరుకి సీఎం చంద్రబాబు…
- రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడల అభివృద్ధికి నెల్లూరు నుండి శ్రీకారం
- మీడియా సమావేశంలో మంత్రి ఆనం
మే 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్ది తెలిపారు. ఈ మేరకు ఆయన నెల్లూరులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి సీఎం పర్యటన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడల అభివృద్ధికి నెల్లూరు నుండి శ్రీకారం చుట్టనున్నాయని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ సందర్శనర్థం మెదటి సారి వచ్చిన ముఖ్యమంత్రి.. రెండొవ సారి పారిశ్రామిక అభివృద్ధి కోసం నెల్లూరు జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు. రేపు ఉదయం 11.30కి ఆత్మకూరుకు చేరుకుంటారని చెప్పారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని…తిరిగి సాయంత్రం 4.40: హెలీఫాడ్ చేరుకుని తిరుగు పయనం అవుతారని ఆనం పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుండి లింగ తారతమ్యాలు లేకుండా 2047 లక్ష్యంగా ఇంటికి ఒక పారిశ్రామికవెక్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యమన్నారు.