పహల్గాం ఉగ్రవాదుల దాడి మృతుడు మధుసూదన్ రావు కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శ మధుసూదన్ రావు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
ఉగ్రవాదులను ఏరివేయాలి…!
- పహల్గాం ఉగ్రవాదుల దాడి మృతుడు మధుసూదన్ రావు కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శ
- మధుసూదన్ రావు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
భారత దేశానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదులను ఏరివేయాలని, ఇందు కోసం దేశ ప్రధాని తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మృతి చెందిన కావలి వాసి మధుసూదన్ రావు కుటుంబానికి బుధవారం వైసీపీ నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలీవేటి సంజీవయ్య, ఎంఎల్సీ మేరిగ మురళీ, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి లు పరామర్శించారు. మధుసూదన్ రావు
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మధుసూదన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆనం విజయకుమార్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
వైసీపీ పార్టీ, నాయకులుగా తాము మధుసూదన్ రావు కుటుంబానికి అన్ని విధాల సహాయం చేస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.