సైదాపురం మండలంలో 115 మంది మంజూరు
ఎంపీడీవో శివకుమార్
స్పౌజ్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి
- సైదాపురం మండలంలో 115 మంది మంజూరు
- ఎంపీడీవో శివకుమార్
పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా స్పౌజ్ కేటగిరీని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఎంపీడీవో శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో 115 మందికి మంజూరు అయ్యాయని తెలియజేశారు. వారు సచివాలయంలో కానీ, ఆన్ లైన్ లో కానీ నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.