సూళ్లూరుపేట భవితలో విద్యా కుసుమాలు

పది ఫలితాల్లో సత్తా చాటిన దివ్యాంగులు

విద్యార్థులకు మెమెంటోలు, రూ.3000 నగదు అందించి వారిని అభినందించిన వక్తలు

పేట భవితలో విద్యా కుసుమాలు…

  • పది ఫలితాల్లో సత్తా చాటిన దివ్యాంగులుగా
  • విద్యార్థులకు మెమెంటోలు, ₹3000 నగదు అందించి వారిని అభినందించిన వక్తలు

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన హారిక, మునిసాగర్, శ్రీనివాసులు ముగ్గురు దివ్యాంగుల విద్యార్థులను కొనియాడుతూ సోమవారం అభినందన సభ నిర్వహించారు. సూళ్లూరుపేటలోని భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు వి.టి.భార్గవి అధ్యక్షతన నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథులుగా ఎంఈఓ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు ఉస్మాన్ భాష, ఎన్.పి.ఆర్.డి అధ్యక్షురాలు నాదెళ్ల శాంతకుమారి పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ సాధారణ విద్యార్థులకు పోటీ పడుతూ విభిన్న విజేతలుగా విద్య కుసుమాలు వారి నైపుణ్యాన్ని చాటుకున్నారని నిజమైన విజేతలు వారు సమాజంలో అని కొనియాడారు. వారు ఉన్నత స్థాయికి ఎదిగి ఇదే స్ఫూర్తితో ప్రోత్సహిస్తూ ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించాలని కోరారు. విద్యార్థులకు మమెంటోలు అందజేశారు. అలాగే నాదెళ్ల శాంతకుమారి సహకారంతో ఆమె చేతుల మీదుగా విద్యార్థులకు 3000 రూపాయలు నగదు అందించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారి, పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *