డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైన మెట్టుకూరు ధనుంజయరెడ్డి
హర్షం వ్యక్తం చేసిన కూటమి నేతలు, అభిమానులు
రెండో సారి కూడా మెట్టుకూరే…
- డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైన మెట్టుకూరు ధనుంజయరెడ్డి
- హర్షం వ్యక్తం చేసిన కూటమి నేతలు, అభిమానులు
నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్గా మెట్టుకూరు ధనుంజయరెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రెండోసారి మెట్టుకూరు డీసీసీబీ ఛైర్మన్గా ఎంపిక కావడంతో ఆయన అనుచరులు, కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతనికి ఫోన్ ద్వారా ముఖ్య నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు. అనంతసాగరం మండలంలోని లింగంగుంట గ్రామ వాసి కావడంతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.