నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన కమిషనర్
మన మిత్రని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
- కమిషనర్ వై.ఓ నందన్
- నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన కమిషనర్
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “మనమిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా మున్సిపల్ సేవలను సులభతరంగా అందుకోవచ్చని, యాప్ ను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అన్ని డివిజన్లనుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేదికలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.