కుటుంబ సభ్యులకి చెక్కును అందచేసిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
కావలిలోని మధుసూదన్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ప్రజా ప్రతినిధులు
మధుసూదన్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం
- కుటుంబ సభ్యులకి చెక్కును అందచేసిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
- కావలిలోని మధుసూదన్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ప్రజా ప్రతినిధులు
పహల్గాం వద్ద ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కావలి వాసి మధుసూదన్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర భరోసా ఇచ్చారు. మృతుడు మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను ఆదివారం వారు పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి పది లక్షల చెక్కును అందజేశారు.అనంతరం ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఉగ్రవాద చర్య జరగడం చాలా దురదృష్టకరని ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన సదుపాయాలను అందజేసే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.