సీఎం చంద్రబాబు సారధ్యంలో అభివృద్ధి పథంలో రాష్ట్రం
కావలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ఎంపీ వేమిరెడ్డి
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీద, ఎమ్మెల్యే కావ్య, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి
నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి
- సీఎం చంద్రబాబు సారధ్యంలో అభివృద్ధి పథంలో రాష్ట్రం
- కావలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ఎంపీ వేమిరెడ్డి
- ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీద, ఎమ్మెల్యే కావ్య, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి
కూటమి నాయకులు, కార్యకర్తలను ఎవరూ విడదీయలేరని, అది ఎవరికీ సాధ్యం కాదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డితో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్, కావలి నియోజకవర్గం జనసేన ఇన్చార్జి అలహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నేతలు ప్రసంగించారు. ప్రతీ కార్యకర్తకి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నాయకులందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు.