దొరవారిసత్రంలో క్యామెల్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో గ్రీవెన్స్డే
గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
గిరిజనాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి
- దొరవారిసత్రంలో క్యామెల్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో గ్రీవెన్స్డే
- గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో క్యామెల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే నేలవల విజయశ్రీ పాల్గొని గిరిజనుల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారని తెలిపారు. క్యామెల్ సంస్థ గిరిజన సమస్యలను సేకరించి సమర్పించిందని, త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్యామెల్ అధినేత ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.