ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరురూరల్ తాటిపర్తి రహదారి శిలాఫలకం ప్రారంభోత్సవం
భారీ ర్యాలీ… పసుపుమయమైన తాటిపర్తిపాళెం
కాబోయే ఎమ్మెల్యే గిరిధర్ రెడ్డి…
- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- నెల్లూరురూరల్ తాటిపర్తి రహదారి శిలాఫలకం ప్రారంభోత్సవం
- భారీ ర్యాలీ…పసుపుమయమైన తాటిపర్తిపాళెం
నెల్లూరు రూరల్ లో తాటిపర్తి రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దేవరపాలెం సెంటర్ దగ్గర నుంచి తాటిపర్తి పాలెం రహదారి ప్రారంభోత్సవ శిలాఫలకం వరకు తెలుగు తమ్ముళ్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2వేల మంది పాల్గొనడంతో తాటిపర్తిపాళెం పసుపుమయమైపోయింది. జై శ్రీధరన్న…జై గిరన్న నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు విచ్చేశారు. వీపీఆర్ కి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో ఎంపీ వేమిరెడ్డి కలిసి రహదారి శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ….నెల్లూరు రూరల్ నుంచి కాబోయే ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రతినిత్యం జనంలో ఉండడం గొప్ప వరం అన్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…రూరల్ లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.