మత్స్యకార సేవా పథకం నిధులు విడుదల

మత్స్యకర సేవలో.. అనే థీమ్ తో మత్స్యకార సముద్ర చేపల వేట నిషేధ భృతి పంపిణీ

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్, చేతుల మీదుగా మత్స్యకారులకు మెగా చెక్కులను

అందజేత – తిరుపతి జిల్లాలో 3947 మత్స్యకారులకు ₹7 కోట్ల 89 లక్షల 40 వేలు లబ్ధిదారులు ఖాతాలో జమ

మత్స్యకార సేవా పథకం నిధులు విడుదల..

  • మత్స్యకర సేవలో.. అనే థీమ్ తో మత్స్యకార సముద్ర చేపల వేట నిషేధ భృతి పంపిణీ
  • ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్, చేతుల మీదుగా మత్స్యకారులకు మెగా చెక్కులను అందజేత
  • తిరుపతి జిల్లాలో 3947 మత్స్యకారులకు ₹7 కోట్ల 89 లక్షల 40 వేలు లబ్ధిదారులు ఖాతాలో జమ..

తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయ మెగా చెక్కులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్ చేతులు మీదుగా అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ… సముద్ర చేపల వేట నిషేధిత మృతి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి బుడగట్లపాలెం, శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించామని రొయ్యలు చేప జాతులకు సంతాన ఉత్పత్తి సమయం కాబట్టి ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 61 రోజుల సముద్ర చేపల వేట నిషేధ కాలంలో ఎటువంటి జీవనోపాధి ఉండదు కాబట్టి వారి ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో 20 వేల రూ. జమ చేయడం జరిగిందన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని వేట నిషేధిత కాలంలో కూటమి ప్రభుత్వం హామీ మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన 1685 లబ్దిదారులకు 20,000 రూపాయల చొప్పున మంజూరు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మత్స్యకారుల తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులు జయపాల్, నాగరాజు, ఏడుకొండలు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *