నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

నెల్లూరు నగరం 9వ డివిజన్లో అంబేద్కర్ పార్కును రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక్క రూపాయికే అండర్ గ్రౌండ్ డ్రౌనేజీ కనెక్షన్, రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

కలిగిరిలో శుక్రవారం అర్దరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెయిన్ రోడ్డుపై పోలీసుస్టేషన్ ఎదుట జిర్రావారిపాళెం గ్రామస్థులు రాస్తోరోకోకి దిగారు. సీఐ వచ్చి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని రోడ్డుపై బైఠాయించారు. దీంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.

కావలి పట్టణం వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సిఐలు ఫిరోజ్ , గిరిబాబు , రాజేశ్వర్ రావు, పాపారావు, 10 మంది ఎస్సై లు, 50 మంది సిబ్బందితో ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని…ఎవరైనా తప్పులు చేస్తే బదిలీ వేటు తప్పదని మంత్రి నారాయణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, కో ఆర్డినేటర్లు, కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సూళ్లూరుపేటలోని ఓ కళ్యాణ మండపంలో…వర్క్ షాప్ కం ఇంటరాక్షన్ మీటింగ్ ను ఆర్డీవో కిరణ్మయి నిర్వహించారు. తొమ్మిది మండలాల్లోనూ 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆమె తహసీల్దార్, రీ సర్వే ఉప తహసీల్దార్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ తదితరులను ఆదేశించారు.

నెల్లూరులోని సంతపేట మార్కెట్ ను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సందర్శించారు. మార్కెట్లోని పలు సమస్యలను వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ పరిశీలించి పరిష్కరిస్తానని నారాయణ హామీ ఇచ్చారు

సీతారామపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. సమావేశంలో పలు అంశాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు తీర్మానించారు. రూ. 2 కోట్లతో మండలంలో అభివృద్ధి ప‌నులు చేపడుతున్నామని ఎంపీపీ తెలిపారు.

మెప్మా మహిళలకి మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. తొలి విడతలో 167 మంది మెప్మా మహిళలకు స్టాల్స్ కేటాయిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో స్మార్ట్ స్ట్రీట్ పై ఆయన సమీక్షించారు.

ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షల నగదు, 29 స్మార్ట్‌ఫోన్‌లు, 21 కీప్యాడ్ ఫోన్‌లు, 57 ATM కార్డులు, 1 wifi router, 1 ప్రింటర్, 1 ల్యాప్‌టాప్, 1 కార్డ్ కటింగ్ మెషిన్, 1 లామినేషన్ మెషిన్, పాస్‌బుక్‌లు, సిమ్ కార్డులు, డైరీలు, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

పేద మహిళలే పారిశ్రామికవేత్తలు…సీఎం చంద్రబాబునాయుడు అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తం సరఫరా చేస్తామంటున్నారు ఆ మహిళలు… నారాయణ సార్ అండ ఉంటే ఏమైనా సాధించగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులోని బిజినెస్స్ ఉమెన్స్ పై ఎన్ 3 సక్సెస్ స్టోరీ…మీ కోసం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *