జల్లెడ పట్టిన పోలీసులు

లాడ్జీలు, హోటల్స్ లో ఆకస్మిక తనిఖీ

రద్దీ ప్రాంతంలోనూ పోలీసుల సెర్చింగ్

జల్లెడ పట్టిన పోలీసులు…

  • లాడ్జీలు, హోటల్స్ లో ఆకస్మిక తనిఖీ
  • రద్దీ ప్రాంతంలోనూ పోలీసుల సెర్చింగ్

ఉన్నతాధికారుల ఆదేశాలతో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా లాడ్జిలు, బస్టాండ్, రద్దీగా ఉన్న సెంటర్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో పోలీసులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్ , కృష్ణపట్నం ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని లాడ్జిలు ఆర్టీసీ బస్టాండ్ రద్దీ ప్రాంతాలలో, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జిలలో రికార్డులను పరిశీలించి రూముల్లో ఉన్న వారిని ఆధార్ కార్డులు, కంపెనీ గుర్తింపు కార్డులను సిఐ రవి నాయక్ పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు ఉంటే తమకు సమాచారం అందించాలని లాడ్జి సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లాడ్జిలలో తనిఖీలు నిర్వహించామని అసాంఘిక కార్య కళాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *