కావలిలో సర్వం సిద్ధం

రేపే మినీ స్టేడియంలో ట్రై సైకిళ్ల పంపిణీ, ఆత్మీయ సమావేశం

ఆత్మీయ సమావేశానికి తరలిరానున్న కూటమి నాయకులు, కార్యకర్తలు

హాజరు కానున్న ఎంపీ వేమిరెడ్డి, కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి, ముఖ్యనేతలు

కావలిలో సర్వం సిద్ధం…

  • రేపే మినీ స్టేడియంలో ట్రై సైకిళ్ల పంపిణీ, ఆత్మీయ సమావేశం
  • ఆత్మీయ సమావేశానికి తరలిరానున్న కూటమి నాయకులు, కార్యకర్తలు
  • హాజరు కానున్న ఎంపీ వేమిరెడ్డి, కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి, ముఖ్యనేతలు

కావలి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు భరోసానిస్తూ.. వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఆదివారం ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్ల అందజేత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు 160 మందికి ట్రై సైకిళ్లు అందించనుండగా… అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం జరగనుండగా.. అందుకు సంబంధించి అన్ని వసతులు కల్పించారు. ట్రై సైకిళ్ల అందజేతకు, ఆత్మీయ సమావేశానికి వేర్వేరుగా వేదికలు ఏర్పాటు చేశారు. కావలి నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలిరానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *