భార‌తీయులంతా ఏకం కావాలి

ఉగ్ర‌దాడిని ఖండిస్తూ సంగంలో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టిన స్థానికులు

భార‌తీయులంతా ఏకం కావాలి

  • ఉగ్ర‌దాడిని ఖండిస్తూ సంగంలో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టిన స్థానికులు

జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్ర దాడిలో ప్రాణాలు వదిలిన 28 మంది అమాయక హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా సంగంలో స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్ నుండి హై వే వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని అన్నారు. ఈ ఉగ్రవాదుల దాడి అమాయక ప్రజలపైన కాదని యావత్ భారతదేశంపై దాడి జరిగినట్లుగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. చైనా, పాకిస్తాన్ దేశాలు ప‌న్నుతున్న కుట్రలకు దేశభక్తులు అందరూ ఏకమై ఏకతాటిపై వచ్చి ప్రేరేపిత ఉగ్రవాదుల నుండి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మాఘం గిరి బాబు, ఉపాధ్యాయులు సురేంద్ర రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *