నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

ఉగ్రదాడిలో అశువులు బాసిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని మాజీ డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి పరామర్శించారు. మధుసూదన్ రావు చిత్రపటానికి నివాళులర్పించి… కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనర్ నందన్, ఆర్డీవో అనూష, వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు. అతి త్వరలోనే నెల్లూరు ప్రజలకి శుభవార్త చెబుతామని శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు పరామర్శించారు. మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

ఉగ్రవాద చర్యలను ప్రతీ ఒక్కరూ ఖండించాలని జనసేన నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు కోరారు. జమ్ము కాశ్మీర్ లో జరిగిన టెర్రర్ ఎటాక్ ని వ్యతిరేకిస్తూ నెల్లూరు నగరంలో మానవహారం నిర్వహించారు.

ఇసుక, క్వాడ్జ్ లలోనూ సామాజిక న్యాయం కావాలని సీడబ్ల్యూసీ మెంబర్, మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఒకరిద్దరికే వేల కోట్లు ఇస్తే అదెలా సామాజిక న్యాయం అవుతుందని ప్రశ్నించారు.

హిందువులపై ఉగ్రవాదుల దాడిని జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు మానవహారం చేపట్టారు.

ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో షాలెట్ బాల్య వివాహాల నియంత్రణపై పొదుపు సిబ్బందికి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఆయన చెప్పారు. బాల్య వివాహాలు చేస్తున్నారని తెలిసిస్తే వెంటనే 1098 సమాచారం అందించాలని కోరారు.

ముత్తుకూరు మండలం జంగాలకండ్రిగలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం, ఏపీ సి ఎన్ ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నవ ధాన్యాలతోపాటుగా మరో ముప్పై రకాల విత్తనాలు కలిపిన ప్రత్యేక కిట్లను DAO సత్యవాణి రైతులకు అందజేశారు.

పహల్గాంలో ఉగ్రవాద దాడిని కుప్పం నియోజకవర్గ జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పట్టణంలో నాయకులు, కార్యకర్తలు సంతాప దినాలు నిర్వహించారు.

స్పౌజ్ పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని వాకాడు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *