ఎన్3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌

నెల్లూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ లో ప్రేమజంట పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమని పెద్దలు నిరాకరించారనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సంతపేట సీఐ దశరధరామారావు వెల్లడించారు.

ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని సూళ్లూరుపేటలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. హిందువులపై దాడి హేయమైన చర్య అని వాసవీ, వనిత క్లబ్ సభ్యులు ఖండించారు.

వింజమూరు మండలం మోటచింతలపాళెం గ్రామంలో సుందర రామిరెడ్డి అనే రైతులో తన పొలంలో భారతి 756 విత్తన రకం సాగు చేశారు. సాగుని ఏడీఏ రామిరెడ్డి, వ్యవసాయ అధికారులు సందర్శించారు. భారతి 756తోనే అధిక దిగుబడులు అందుతాయని ఆయన చెప్పారు.

అర్హులైన లబ్దిదారులకి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామస్థులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని వారు ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్లకు వినతి పత్రం అందచేశారు.

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారుల్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశించారు. పాకాల మండలం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

బాలాయపల్లి మండలంలో చెత్త నుంచి సందప తయారీ కేంద్రంపై టీడీపీ నాయకులు, అధికారులు ఒక్క రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడంతోపాటు… వేస్ట్‌ పదార్థాల నుంచి ఎరువును తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు.

అమాయక ప్రజలపై ఉగ్రవాద మూకల దాడిని కావలి ముస్లిం సోదరులు ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా వారు జామియా మసీదు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పది ఫలితాల్లో సూళ్లూరుపేటలోని నారాయణ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. హరి మనోజ్న విద్యార్థిని 595 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచిందని ప్రిన్సిపాల్ శివ ప్రసాద్ తెలిపారు.

సూళ్లూరుపేట పట్టణంలోని టిడిపి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి 65 అర్జీలను స్వీకరించారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన మగర్ల శాన్వి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ చిన్నారి వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹5.33 లక్షలు విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ని ఎమ్మెల్యే విజయశ్రీ తన క్యాంప్ కార్యాలయంలో చిన్నారి బంధువులకు అందజేశారు.

ఈనెల 27న ఆదివారం కావలి పట్టణంలో వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో దివ్యాంగులకి ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఇందు కోసం కావలి మినీ స్టేడియంలో చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరు కానున్నారు.

హల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ… ఉదయగిరి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఉదయగిరి హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం మానవహారంగా ఏర్పడి ఉగ్రవాద చర్యలను ముక్తకంఠంతో ఖండించారు.

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. యువత, విద్యావంతులు కలిసి ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రూ. 10 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డుని ఎమ్మెల్యే ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *