పెహల్గాంలో ఉగ్రవాద దుచ్చర్యను ఖండించిన కావలి ముస్లిం సోదరులు
జామియా మసీద్ వద్ద ఇమామ్ ఆధ్వర్యంలో ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిరసన
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి
- పహల్గాంలో ఉగ్రవాద దుచ్చర్యను ఖండించిన కావలి ముస్లిం సోదరులు
- జామియా మసీద్ వద్ద ఇమామ్ ఆధ్వర్యంలో ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిరసన
కాశ్మీర్ లో పహల్గాం పర్యాటక ప్రాంతంలో అమాయక ప్రజల పై ఉగ్రవాద మూకలు దాడి చేయడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు కావలి ముస్లిం సోదరులు తెలిపారు. కావలి పట్టణం జామియా మసీద్ ఆవరణలో శుక్రవారం ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇమామ్ మౌలానా అబ్దుల్ రషీద్, వాయిస్ ఆఫ్ ముస్లిం అధ్యక్షుడు సలీం బేగ్ ఎన్ త్రీ న్యూస్ తో మాట్లాడారు. ఇస్లాం మతం ఎప్పుడూ శాంతి, ఇతరుల పట్ల ప్రేమను చూపించమనే చెబుతుందన్నారు. ఉగ్రవాద మూకలు అమాయక ప్రజలను చంపే దుచ్చర్యలకు పాల్పడడం సరికాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.