గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన సంతపేట పోలీసులు
ఐదు మంది అరెస్ట్
రూ. 2.50 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం
మీడియా సమావేశంలో నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ
ప్యాకెట్ గంజాయి రూ. 300
- గంజాయి ముఠా గుట్టురట్టు చేసిన సంతపేట పోలీసులు
- ఐదు మంది అరెస్ట్ – రూ. 2.50 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం
- మీడియా సమావేశంలో నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ
ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి నెల్లూరులో అమ్ముతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముద్దాయిలను నెల్లూరు నగర డీఎస్పీ సింధుప్రియ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. స్థానిక సంతపేట పోలీసుస్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి ముద్దాయిల వివరాలు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్, అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆదేశాలతో నెల్లూరు నగరంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ తనిఖీల్లో భాగంగా నెల్లూరు సిటీ పెన్నా పొర్లుకట్ట సమీపంలో ఒరిస్సా నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తుండగా మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారని చెప్పారు. ఈ కేసులో రంజిత్ నాయక్ అనే వ్యక్తి ఒరిస్సా నుంచి కేజీల రూపంలో గంజాయి తెచ్చి చిన్న ప్యాకెట్లుగా కట్టి రూ. 300 వంతున అమ్ముతున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఐదు మందిని అరెస్టు చేయడంతోపాటు రూ. 2.50 లక్షల విలువ చేసే ఐదు కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపిన డీఎస్పీ ఈ కేసులో ప్రతిభ కనబరచిన సీఐ దశరధరామారావు, ఎస్ఐ బాలకృష్ణ తదితరులను జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఆమె వెల్లడించారు.